Elephant | కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మున్నార్ (Munnar)లో ఓ ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న పర్యాటకుల వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో పర్యాటకులు తమ వాహనాలను వదిలి పరుగులు తీశారు. ఏనుగు దాడిలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటన కల్లార్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది. కొందరు పర్యాటకులు రెండు వాహనాల్లో మున్నార్వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో కల్లార్ డంపింగ్ యార్డు సమీపంలో పడయప్ప (Padayappa) అనే అడవి ఏనుగు పర్యాటక వాహనాలకు అడ్డంగా వచ్చి బీభత్సం సృష్టించింది. దీంతో అందులోని పర్యాటకులు తమ వాహనాల నుంచి కిందకు దిగి అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం రెండు కార్లపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో ఆ వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. అనంతరం సమీపంలోని పర్యాటకులపైకి కూడా ఏనుగు దూసుకెళ్లింది. అయితే, యువకులు పరుగులు తీయడంతో పడయప్ప సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఏనుగు దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Tourists harassed an Tusker named Padayappa on Nallathanni Kallar road today,Munnar region of Kerala State.FD should take immediate action against them and impound these two vehicles with KL registration @moefcc @rameshpandeyifs @ForestKerala @saseendran_ak @rashtrapatibhvn pic.twitter.com/5w5X64T7H3
— Parthiban S (@Parthiban951428) May 26, 2024
Also Read..
Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి దుర్మరణం
Tirumala | తిరుమల కొండకు భారీగా తరలివస్తున్న భక్తులు.. నిన్న ఒక్కరోజే 89,161 మంది దర్శనం
Dhadak 2 | బాలీవుడ్ నుంచి క్రేజీ సీక్వెల్.. ఇంట్రెస్టింగ్గా ‘ధడక్ 2’ అనౌన్స్మెంట్ వీడియో