తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం కొలువుదీరిన వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల (Tirumala) కొండకు భారీగా తరలి వస్తున్నారు. వారం రోజులుగా భక్తుల తాకిడి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది . ఈనెల 23న 65,416 మంది భక్తులు 24న 70,668 మంది, 25న 83,866 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న స్వామివారిని 89,161 మంది భక్తులు దర్శించుకోగా 36,450 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.77 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తెలిపారు.