హైదరాబాద్ : గ్రామపంచాయతీల్లో పెండింగ్లో ఉన్న వివిధ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.217 కోట్లు 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో పెడింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనులు ఉధృతంగా జరుగుతున్నాయి. పని ప్రదేశాల్లో కూలీలకు కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఎండ కాలంలో కూలీలు వడ దెబ్బ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య సర్వేలో ఆశ వర్కర్లతో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు సమన్యయంతో పని చేసి ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం అయ్యేలా చూడాలన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.1554 కోట్ల వ్యయంతో 12,270 వైకుంఠధామల నిర్మాణాలు చేపట్టాం. ఇందులో 11250 పూర్తి అయ్యాయి. 1470 వివిధ దశలల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా దృష్ట్యా పూర్తి అయిన వైకుంఠధామాలను వెంటనే వినియోగం లోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు.
టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన PMGSY పనులను వెంటనే ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామాల్లో కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ రఘున౦దన్ రావు, ఈఎన్సీ సంజీవ రావు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగల్ సీపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత
అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి