ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్( KMC) నూతన మేయర్గా ఎన్నికైన పునుకొల్లు నీరజ, ఉప మేయర్ ఫాతిమా జోహారాకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. సోమవారం జడ్పీ హాలో నిర్వహించిన సమావేశంలో మేయర్, ఉప మేయర్ లకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఖమ్మం నగరాభివృద్ధికి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో కొవిడ్ తీవ్రత ఎక్కువ ఉన్నందున కార్పొరేషన్ పరిధిలో తగు చర్యలు చేపట్టాలని మంత్రి వారికి సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనాలకు మించి మంచి పాలన అందించాలని కోరారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి చేద్దామని, అందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్ డివిజన్ల నుండి గెలుపొందిన కార్పొరేటర్లకు మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత