DC vs GT | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు ధాటిగా ఆడారు. ముఖ్యంగా రిషబ్ పంత్, అక్షర్ పటేల్ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జేక్ ఫ్రేజర్, పృథ్వీషా దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించారు. కానీ నాలుగో ఓవర్కే ఇద్దరూ ఔటయ్యారు. పవర్ ప్లే ముగిసేలోపు షై హోప్ (5) రూపంలో మూడో వికెట్ను కోల్పోయింది. వరుసగా వికెట్లను కోల్పోవడంతో ఢిల్లీ బ్యాటర్లు ఆచితూచి ఆడటం మొదలుపెట్టారు. రిషబ్ పంత్ (88), అక్షర్ పటేల్ (66) జోరుగా ఆడారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగారు. అయితే 17వ ఓవర్లో సాయికిశోర్కు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ ఔటయ్యాడు. తర్వాత వచ్చిన స్ట్రబ్స్ (26) కూడా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసరికి నాలుగు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. గుజరాత్ ముందు పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.