AP News | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ను ఎన్నికల కమిషన్ నియమించింది. విజయవాడ సీపీగా పీహెచ్డీ రామకృష్ణకు బాధ్యతలు అప్పగించింది. గురువారం ఉదయంలోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ క్రాంతి రాణాను బదిలీ చేస్తూ ఏపీ ఈసీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. వీరిని తక్షణమే విధుల నుంచి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.