Congress Party | తెలంగాణలో మరో మూడు పార్లమెంట్ స్థానాలకు తెలంగాణ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్సభ స్థానానికి అభ్యర్థిగా రామ సహాయం రాఘురాంరెడ్డి పేరును ఖరారు చేసింది. కరీంనగర్ టికెట్ను వెలిచాల రాజేందర్రావు కేటాయించింది. ఇక హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా మహమ్మద్ సమీర్ను పేరును ప్రకటించింది. అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ఇప్పటి వరకు 14 సీట్లకు అభ్యర్థులను కేటాయించిన విషయం తెలిసిందే.
తాజాగా పెండింగ్లో ఉన్న మూడు స్థానాలకు సైతం అభ్యర్థులను ఖరారు చేసింది. ఆయా స్థానాల్లో తమకు కావాలంటే తమకు కావాలని కీలక నేతలు పట్టుబట్టడంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యంగా జరిగినట్లు తెలుస్తున్నది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల మే 13న జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ల కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ నెల 25తో నామినేషన్ల గడువు ముగియనున్నది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఉన్నది. మే 13న పోలింగ్ జరుగనుండగా.. జూన్ 4న ఫలితాలను వెల్లడవనున్నాయి.