న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా టీకా పంపణీ కొనసాగుతోంది. బుధవారం రాత్రి 8 గంటల వరకు 11.43 కోట్ల డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మూడు రాష్ట్రాల్లో టీకాల పంపిణీ కోటి మార్క్ దాటిందని పేర్కొంది. మహారాష్ట్రలో 1,11,19,018), రాజస్థాన్ 1,02,15,471, ఉత్తర ప్రదేశ్ 1,00,17,650 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 69,974 టీకా కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపింది. పని ప్రాంతాల్లోనూ టీకాలు వేస్తున్నందున లబ్ధిదారుల సంఖ్య అధికంగా ఉందని మంత్రిత్వశాఖ చెప్పింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు తాత్కాలిక నివేదిక ప్రకారం.. 11,43,18,455 డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో 90,63,976 మంది ఆరోగ్య కార్యకర్తలు మొదటి డోసు.. మరో 56,03,568 మంది రెండో డోసు తీసుకున్నట్లు తెలిపింది.
అలాగే 1,02,09,443 మంది ఫ్రంట్లైన్ కార్మికులు మొదటి డోసు.. 50,61,571 మంది రెండో డోసు.. 45-60 ఏళ్ల మధ్య వయస్సు 3,73,34,924 మందికి మొదటి డోసు, 8,94,077 మంది లబ్ధిదారులకు రెండో డోసు, 60 ఏళ్లుపైబడిన వ్యక్తులకు 4,34,13,349 ఫస్ట్ డోస్, 27,37,547 మందికి సెకండ్ డోస్ వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. వ్యాక్సిన్ డ్రైవ్ బుధవారం నాటికి 89వ రోజుకు చేరగా.. ఒకే రోజు 31,39,063 వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు చెప్పింది. ఇందులో 27,19,964 మంది లబ్ధిదారులకు మొదటి మోతాదుకు టీకాలు వేయగా, 4,19,099 మంది లబ్ధిదారులకు టీకాల రెండవ మోతాదును తాత్కాలిక నివేదిక ప్రకారం అందుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.