AP News | ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా నామినేషన్ల సమయంలోనూ తమ బలాన్ని చూపించుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో చేసిన ఓ ఫీట్ రివర్స్ అయ్యింది. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్కంఠ పరిస్థితుల మధ్య శింగనమల నుంచి దళిత నాయకురాలు బండారు శ్రావణి టీడీపీ టికెట్ దక్కించుకుంది. దీంతో సంబురాల్లో మునిగిపోయిన శ్రావణి.. గురువారం నాడు నామినేషన్ వేసింది. ఈ సందర్భంగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు కొందరు ఓవర్యాక్షన్ చేశారు. ట్రాక్టర్తో రౌండ్గా చక్కర్లు కొడుతూ స్టంట్ చేశారు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా అపశృతి
శింగనమల టీడీపీ అభ్యర్థి శ్రావణి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా ట్రాక్టర్తో సర్కస్ ఫీట్లు చేస్తుండగా అదుపు తప్పి బోల్తా పడిన ట్రాక్టర్.. నలుగురికి తీవ్ర గాయాలు. pic.twitter.com/7YyN6RqL3P
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2024