న్యూఢిల్లీ : గూగుల్ సంస్థలో వేధింపులు పెరిగిపోతున్నాయట. దాంతో తమను ఆదుకోని సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని ఏకంగా 500 మంది ఉద్యోగులు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్కు బహిరంగ లేఖ రాశారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో గూగుల్ సంస్థలో జరుగుతున్న వేధింపులపై ఆ సంస్థ మాజీ ఇంజినీర్ ఎమీ నీట్ఫీల్డ్ ఒక ఆర్టికల్ ప్రచురితమైన తర్వాత ఈ లేఖ రాసినట్లుగా తెలుస్తున్నది. 500 మంది ఉద్యోగులు రాసిన లేఖ ప్రస్తుతం టెక్ రంగంలో సంచలనం రేపుతున్నది.
గూగుల్ మాజీ ఇంజినీర్ అయిన ఎమి నీట్ఫీల్డ్ ఎలా వేధింపులకు గురయ్యారని చెప్తూ.. ఆమెను కావాలనే వేధింపులకు గురిచేసే ఉద్యోగుల పక్కనే కూర్చోబెట్టినట్లు ఆ లేఖలో వివరించారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు నివేదిస్తే కౌన్సెలింగ్ కోరవచ్చు లేదంటే ఇంటి నుంచి పనిచేయవచ్చు అదీ కాదంటే సెలవుపై వెళ్లవచ్చునని చెప్పడం తనను వేధించడానికి మద్దతివ్వడంలాగా కనిపించిందంట. గూగుల్లో పనిచేసిన తర్వాత.. నేను మళ్లీ ఉద్యోగాన్ని ప్రేమించను అనే శీర్షికతో న్యూయార్క్ టైమ్స్ ఒపెడ్ పేజీలో కథనం రాసింది. జాత్యాహంకారం లేదా సెక్సిజం గురించి నివేదించిన ఇతర ఉద్యోగులకు కూడా గూగుల్ నుంచి ఇలాంటి స్పందనే వచ్చిందని తెలుసుకున్నాను అని ఆమె రాశారు.
నీట్ఫెల్డ్ కేసు గూగుల్లో జరిగిన మొదటి కేసు కాదని, వేధింపులకు గురైన వ్యక్తిని రక్షించడానికి బదులు వేధింపుదారును రక్షించే చరిత్ర కంపెనీకి ఉన్నదని ఆ లేఖ ఆరోపించారు. ఆండ్రాయిడ్ మొబైల్ సాఫ్ట్వేర్ సృష్టికర్త ఆండీ రూబిన్కు ఓరల్ సెక్స్ చేయమని బలవంతం చేసినట్లు ఒక మహిళ ఆరోపించడంతో 90 మిలియన్ డాలర్ల నిష్క్రమణ ప్యాకేజీని అందుకున్నారు. మాజీ సెర్చ్ ఎగ్జిక్యూటివ్ అమిత్ సింఘాల్కు లైంగిక వేధింపుల విచారణ తర్వాత రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు 35 మిలియన్ డాలర్లు లభించాయి.
2018 లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా, వేధింపుదారుల రక్షణకు వ్యతిరేకంగా 20,000 మందికి పైగా గూగుల్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. అయితే, కంపెనీ పనితీరును మాత్రం మారలేదని, గూగుల్ వాకౌట్ డిమాండ్లను ఏవీ తీర్చలేదని లేఖ వెల్లడించింది. హాని కలిగించే వారి ఆందోళనలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తమ కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్యోగులు కంపెనీని కోరారు.
ఇలాఉండగా, “మేము మా మొత్తం ప్రక్రియను మార్చుతున్నాం. ఉద్యోగుల సమస్యలను స్వీకరించి.. దర్యాప్తు చేసే విధానం, ఆందోళనలను నివేదించే ఉద్యోగుల కోసం కొత్త సంరక్షణ కార్యక్రమాలను ప్రవేశపెట్టాం” అని ఒక ప్రకటనలో గూగుల్ తెలిపింది.
కొవిడ్ వ్యాక్సిన్కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు..
గిన్నిస్ రికార్డు గోర్లు.. 30 ఏండ్ల తర్వాత కత్తిరింపు
కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..
భారత్లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా
వీడియో వైరల్: పనివాడితో గున్న ఏనుగు సరదా పోట్లాట..! గెలుపెవరిదంటే..?
కరోనా సెకండ్ వేవ్ : కొత్తగా మూడు లక్షణాలు.. తేలికగా తీసుకోవద్దు..
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..