రాయపోల్, మే 11 : రాయపోల్లో మండల కేంద్రంలో హరితహారం చెట్లను ఓ షాపు యజమాని నరికివేస్తున్న ఘటన స్థానికులను ఆగ్రహానికి గురి చేసింది. మాతాజీ కిరణ జనరల్ స్టార్ షాపు యాజమాని దుకాణం ముందున్న చెట్లను నాశనం చేస్తున్నాడని, తరచూ వాటి కొమ్మలను కత్తిరిస్తూ, వాటి పెరుగుదలను అడ్డుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం కేసీఆర్ హయాంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం లక్ష్యాలను విస్మరిస్తూ ఇలాంటి చర్యలు కొనసాగడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెట్లు పెద్దగవ్వకముందే నరికివేయడంతో వాటి అభివృద్ధి, పచ్చదనం దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. హరితహారం మొక్కలను నాశనం చేసే వారిపై గ్రామ పంచాయితీ అధికారులు, సిబ్బంది కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.