భారతదేశంలోని మూడు ప్రధాన నగరాల్లో షోరూంలను తెరువడానికి టెస్లా సంస్థ నిర్ణయించింది. ఎక్కడైతే బాగుంటుందనే ప్రదేశాల కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇదే సమయంలో భారతదేశంలోకి ప్రవేశించడానికి ముందే లాబీయింగ్ చేసేందుకు, వ్యాపార ప్రయత్నాలకు నాయకత్వం వహించడానికి ఎగ్జిక్యూటివ్ను కూడా నియమించినట్లు సమాచారం.
ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు అయిన టెస్లా.. జనవరిలో భారతదేశంలో ఒక స్థానిక సంస్థను నమోదు చేసుకున్నది. అక్కడ 2021 మధ్య నాటికి మోడల్ 3 సెడాన్ను దిగుమతి చేసుకుని విక్రయించాలని భావిస్తున్నది. ధనిక వర్గాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి రావాలని కోరుకుంటున్నది.
మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత విలువైన వాహన తయారీదారు రాజధాని న్యూఢిల్లీలో షోరూమ్లు, సర్వీస్ సెంటర్లు.. అలాగే పశ్చిమాన దేశ ఆర్థిక కేంద్రమైన ముంబై మహానగరంలో, దక్షిణాదిన టెక్ సిటీ అయి బెంగళూరులో షోరూమ్లు తెరిచేందుకు టెస్లా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తున్నది. మూడు వైపులా షోరూంలు తెరిచేందుకు 20,000 నుంచి 30,000 చదరపు అడుగుల వరకు ఉన్న వాణిజ్య భవనాల కోసం గాలిస్తున్నారు.
భారతదేశ పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ ఇన్వెస్ట్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ మనోజ్ ఖురానాను దేశంలో తన విధానం, వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలకు నాయకత్వం వహించే మొదటి ప్రధాన నియామకంలో భాగంగా నియమించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
అయితే మనోజ్ ఖురానా నియామకంపై టెస్లా ఇంతవరకు స్పందించలేదు. ఖురానా కూడా ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. గతంలో పలు మార్లు ట్వీట్లు చేసినప్పటికీ.. 2021 లో కంపెనీ ఖచ్చితంగా భారతదేశంలోకి ప్రవేశిస్తుందని టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ గత అక్టోబర్లో వెల్లడించారు.
షోరూమ్ స్థలం కోసం అన్వేషణ, ఖురానా అపాయింట్మెంట్ వంటివి టెస్లా ఎంత వేగంగా కదులుతుందో తెలియజేస్తున్నాయి. టెస్లాకు అవసరమైన షోరూం స్థలాన్ని చూసిపెట్టే బాధ్యతను గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ గ్రూప్నకు అప్పగించినట్లు తెలుస్తున్నది. ఈ సంస్థ గత కొన్ని వారాలుగా స్థలాలను సర్వే చేస్తున్నది. సంపన్న కస్టమర్లు సులభంగా వచ్చేలా చూసేందుకు షోరూంలకు స్థలాలను గుర్తించడంపై ఈ సంస్థ దృష్టి సారించింది.
ట్రైనీ ఎయిర్హోస్టెస్కు ఇంటర్ విద్యార్థి వేధిపులు.. ఐదు గంటల్లోనే పట్టివేత
వీడియో వైరల్: పనివాడితో గున్న ఏనుగు సరదా పోట్లాట..! గెలుపెవరిదంటే..?
భారత్పై సైబర్ దాడులు చేసే సామర్థ్యం చైనాకుంది: సీడీఎస్ బిపిన్ రావత్
రేపు భారత్, చైనా మధ్య 11 వ రౌండ్ చర్చలు
జైలు నుంచి లేఖ రాయడం కొత్త వ్యూహమే : సంజయ్ రౌత్
కరోనా సెకండ్ వేవ్ : కొత్తగా మూడు లక్షణాలు.. తేలికగా తీసుకోవద్దు..
బ్రిటిష్ అసెంబ్లీలో బాంబులు వేసిన భగత్సింగ్, బటుకేశ్వర్.. చరిత్రలో ఈరోజు
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..