న్యూఢిల్లీ : శిక్షణలో ఉన్న ఎయిర్ హోస్టెస్కు ఓ ఇంటర్ విద్యార్థి లైంగిక వేధింపులను ఢిల్లీ సైబర్ పోలీసులు ఐదు గంటల్లోనే ఛేదించారు. సదరు ఇంటర్ విద్యార్థి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా యువతిని వేధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ ఇన్స్టాగ్రామ్లో ట్రైనీ ఎయిర్ హోస్టెస్ అశ్లీల ఫొటోలను పోస్ట్ చేస్తూ తన ఐడీ తెలియకుండా ఉండేలా తెలివిని ఉపయోగించిన విద్యార్థిని ఢిల్లీ సైబర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడిని ఢిల్లీలోని కృష్ణానగర్ నివాసిగా పోలీసులు గుర్తించారు.
ఢిల్లీకి చెందిన ఓ 20 ఏండ్ల యువతి ఎయిర్ హోస్టెస్గా శిక్షణ పొందుతున్నది. ఈమె ఫొటోలను చూసిన ఓ ఇంటర్ విద్యార్థి ఆమెను లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ బెదిరింపులకు దిగాడు. ఆమె అశ్లీల ఫొటోలను ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేస్తానంటూ వేధింపులకు దిగాడు. సదరు విద్యార్థి వేధింపులకు తట్టుకోలేక ఆ యువతి ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తనను గత మూడు, నాలుగు రోజులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నట్లు సదరు యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నది.
యువతి ఫిర్యాదు ఆధారంగా జగత్పూరి పోలీసులు ఐపీసీ 354 (డీ) (స్టాకింగ్), 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే, ఇన్స్టాగ్రాంలో ట్రైనీ ఎయిర్ హోస్టెస్తో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి వివరాలు లేకపోవడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. నిందితుడు స్పూఫ్డ్ ఈమెయిల్ ఉపయోగించి ఆమెకు ఈమెయిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడి ఈ మెయిల్ ఐడీని విశ్లేషించినప్పుడు ఈ మెయిల్ ఖాతాను యాక్సెస్ చేయడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్) ను ఉపయోగిస్తున్నట్లు బయటపడింది. సాంకేతిక నిఘా, సైబర్ ఫోరెన్సిక్ టూల్స్ సాయంతో సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన తరువాత.. ఇంటర్ విద్యార్థికి సంబంధించిన విషయాలను గుర్తించారు. తరువాత అతడిని పట్టుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యసుందరం తెలిపారు.
ఈమెయిల్ ఐడీ, ఇన్స్టాగ్రాం ఖాతాను ఆపరేట్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అదుపులోకి తీసుకున్న బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట ప్రవేశపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. యువతి ఫిర్యాదు చేసిన ఐదు గంటల్లోనే సదరు బాలుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వీడియో వైరల్: పనివాడితో గున్న ఏనుగు సరదా పోట్లాట..! గెలుపెవరిదంటే..?
భారత్పై సైబర్ దాడులు చేసే సామర్థ్యం చైనాకుంది: సీడీఎస్ బిపిన్ రావత్
రేపు భారత్, చైనా మధ్య 11 వ రౌండ్ చర్చలు
జైలు నుంచి లేఖ రాయడం కొత్త వ్యూహమే : సంజయ్ రౌత్
కరోనా సెకండ్ వేవ్ : కొత్తగా మూడు లక్షణాలు.. తేలికగా తీసుకోవద్దు..
బ్రిటిష్ అసెంబ్లీలో బాంబులు వేసిన భగత్సింగ్, బటుకేశ్వర్.. చరిత్రలో ఈరోజు
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..