రోమ్ : (Trevi Fountain) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ20 సదస్సు రెండో సెషన్లో పాల్గొన్నారు. ఈ సెషన్ వాతావరణ మార్పు, పర్యావరణం అనే అంశాలపై చర్చించారు. ఈ సదస్సుతో ప్రధాని మోదీ రెండు రోజుల ఇటలీ పర్యటన ముగిసింది. ఇటలీ నుంచి మోదీ యూకేలోని గ్లాస్గో వెళ్లనున్నారు. అక్కడ వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్కు సంబంధించిన పార్టీల 26వ సమావేశంలో పాల్గొననున్నారు. ఆదివారం నాడు జీ-20 దేశాల అధినేతలతో కలిసి ప్రధాని మోదీ ప్రఖ్యాత ట్రెవీ ఫౌంటెన్కు చేరుకున్నారు. ఇక్కడ ఇతర ప్రపంచ నాయకులతో కలిసి ట్రెవీ ఫౌంటెన్లోకి మోదీ కూడా నాణెం విసిరాడు. ఇలా విసరడం వెనుక ఒక సంప్రదాయం కూడా ఉన్నదని చరిత్రకారులు చెప్తున్నారు.
ఈ ఫౌంటెన్ ఇటలీలోని అత్యంత తాత్విక స్మారక కట్టడాలలో ఒకటి. చక్కటి శిల్పకళా నైపుణ్యం ఈ ఫౌంటెన్ సొంతం. ఈ ఫౌంటెన్ అనేక భారతీయ సినిమాల్లో కూడా కనిపించింది. ఈ ఫౌంటెన్ ఎత్తు 26.3 మీటర్లు. వెడల్పు 49.15 మీటర్లు. కాయిన్ టాస్ సంప్రదాయానికి ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. జీ-20 సదస్సు ముగింపు రోజున మోదీతోపాటు జీ-20 దేశాధినేతలు రోమ్లోని ప్రసిద్ధ ట్రైవీ ఫౌంటెన్కు వెళ్లారు. అక్కడ వెనక్కి తిరిగి నీటిలోకి నాణెం విసరడం ఆనవాయితీ. ఆ ప్రకారంగానే మోదీతోపాటు ప్రపంచ నేతలంతా భుజం మీదుగా నీటిలోకి నాణెం విసిరారు. ఇలా విసిరితే మళ్లీ రోమ్ వెళ్లారని అక్కడి ప్రజల నమ్మకం. మోదీ కూడా ఇతర దేశాధినేతలతో కలిసి నాణెం నీటిలోకి విసిరి తిరిగి రోమ్ వస్తామనే మనుసులో మాటను చెప్పకనే చెప్పారు.
నీరజ్ చోప్రాకు చెన్నై సూపర్ కింగ్స్ స్పెషల్ జెర్సీ
త్వరలో భారత్ నుంచి ఎలోన్ మస్క్ సంస్థకు సరికొత్త సవాల్
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తొలిసారి ప్రపంచం ముందుకొచ్చిన తాలిబాన్ అగ్రనేత అఖుంద్జాదా
వెంకన్నను దర్శించుకున్న అనిల్ అంబానీ దంపతులు
ఏపీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్
ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలి : వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..