(Indo Americans) వాషింగ్టన్: అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం భారతీయ అమెరికన్లకు పెద్ద పీఠ వేస్తున్నది. ఇప్పటికే తన ప్రభుత్వంలో పలు కీలక పదవులను అప్పగించిన జో బైడెన్.. మళ్లీ భారత సంతతి వారిని తన ప్రభుత్వంలో ముఖ్య పదవుల్లో నియమించుకున్నారు. ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయన్స్తోపాటు పసిఫిక్ దీవులకు చెందిన వారి కోసం ఏర్పాటు చేసిన సలహా కమిషన్లో నలుగురు ఇండో అమెరికన్లకు చోటు లభించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన నలుగురిని కమిషన్లో చేర్చుకుంటున్నట్లు ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో వైట్హైజ్ పేర్కొన్నది.
ఏఏఎన్హెచ్పీఐ సలహా కమిటీలో 23 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ సభ్యులుగా తాజాగా సోనాల్ షా, స్మితా షా, అజయ్ భుటోరియా, కమల్ కాల్సి కి నియమించారు. వీరు ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయన్స్తోపాటు పసిఫిక్ దీవులకు చెందిన వారి సంక్షేమంపై అధ్యక్షుడికి సలహాలు ఇస్తుంటారు. సోనాల్ షా విద్యారంగంలో సేవలందిస్తుండగా, స్మితా షా ఇంజినీర్, వ్యాపారవేత్తగా ఉన్నారు. కమల్ కాల్సి అమెరికా సైన్యంలో సేవలందించారు. అజయ్ భుటోరియా సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీ ఎగ్జిక్యూటీవ్గా పనిచేస్తున్నారు.
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..