కఠ్మండూ: భారీ భూకంపంతో నేపాల్ (Nepal) వణికిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి జాజర్కోట్ (Jajarkot) జిల్లాలో 6.4 తీవ్రతతో భూమి కంపించింది (Earthquake). దీంతో 130 మందికిపైగా మృత్యువాతపడ్డారు. వందల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. భూకంపం ధాటికి భారీగా ఇండ్లు నేలమట్టమయ్యాయి. పలు ఇండ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు పెద్దఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ (PM Pushpa Kamal Dahal) పర్యటిస్తున్నారు. జాజర్కోట్లో భూకంప బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. కాగా, భూకంపం వల్ల ఇప్పటివరకు 132 మంది మరణించారు. శిథిలాల్లో పెద్దసంఖ్యలో ప్రజలు చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. జాజర్కోట్, రుకుమ్ జిల్లాల్లో 140 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు దవాఖానకు తరలించారు.
నేపాల్ భూకంప మృతుల పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నేపాల్ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. భూకంప బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
#WATCH | Nepal PM Pushpa Kamal Dahal ‘Prachanda’ arrives in Jajarkot and meets the people affected by the earthquake that struck the region last night.
The death toll in the 6.4 magnitude earthquake stands at 129.
(Video Source: Reuters) pic.twitter.com/sty7recDgR
— ANI (@ANI) November 4, 2023