Bangladesh | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో మరోసారి హింస చెలరేగింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ (Mujibur Rahman) ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. షేక్ హసీనా సామాజిక మాధ్యమం వేదికగా ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ విధ్వంసం చోటు చేసుకుంది.
#WATCH | Bangladesh | A mob vandalised and set on fire Sheikh Mujibur Rahman’s memorial and residence at Dhanmondi 32 in Dhaka, demanding a ban on the Awami League. pic.twitter.com/azMcQCqngM
— ANI (@ANI) February 5, 2025
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అంశంపై గతేడాది చెలరేగిన హింస విధ్వంసకరంగా మారిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లతో ప్రాణ భయంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆమె భారత్లోనే రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హసీనా సోషల్ మీడియా వేదికగా అవామీ లీగ్ పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలోనే హసీనా తండ్రి రెహమాన్ నివాసం వద్ద ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు.
#WATCH | An angry mob vandalized the memorial and residence of Bangladesh’s founding father, Sheikh Mujibur Rahman, located at Dhanmondi 32 in Bangladesh, demanding a ban on Awami League – the party he founded. (05.02.2025) pic.twitter.com/5rVLXot6f1
— ANI (@ANI) February 6, 2025
పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చిన నిరసనకారులు.. రాజధాని ఢాకాలోని (Dhaka) రెహమాన్ ఇంటిపై దాడికి దిగారు. ఇంట్లోకి చొచ్చుకెళ్లి అక్కడున్న వస్తువులను, రెహమాన్ చిత్రపటాలను ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. బంగబంధు ఇల్లు అధికారవాదం, ఫాసిజానికి చిహ్నమని నిరసనకారులు పేర్కొన్నారు. అంతేకాదు, 1972 నాటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని నిరసనకారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ దాడి ఘటనపై షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు. ‘భవనాన్ని కూల్చివేయొచ్చు.. కానీ చరిత్రను కాదని వారు గుర్తించుకోవాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్కు బంగబంధుగా పేరుంది. భారత్ సాయంతో బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని పూర్తిచేయడంలో ఆయన విజయం సాధించారు. అయితే, 1975లో ఆయన అధికారిక నివాసంపై దాడిచేసిన సైన్యం ఆయనతోపాటు ఇంట్లో ఉన్న 18 మందిని చంపేసింది. ఆ సమయంలో హసీనా, ఆమె సోదరి రెహానా జర్మనీలో ఉండటంతో ప్రాణాలతో మిగిలిపోయారు. బంగ్లా చరిత్రలో ముజిబుర్ నివాసం ఒక ఐకానిక్ చిహ్నంగా గుర్తింపు పొందింది. అవామీ లీగ్ పాలనలో దీన్ని మ్యూజియంగా మార్చారు.
Also Read..
Moon | చంద్రుడిపై ఢీకొన్న గ్రహశకలం.. 130 అణుబాంబుల కంటే తీవ్రమైన పేలుడు
H-1B Visa | హెచ్-1బీ వీసాదారులకు షాకివ్వబోతున్న ట్రంప్.. ఆటోరెన్యువల్ రద్దు!
Donald Trump | గాజాను స్వాధీనం చేసుకుంటం.. ట్రంప్ సంచలన ప్రకటన