Tariffs | భారత్పై అమెరికా భారీగా సుంకాలు (Tariffs) విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ నిర్ణయంతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా అమెరికా బాటలోనే మరో దేశం కూడా ఇండియాకి షాకిచ్చింది. భారత్ సహా పలు దక్షిణాసియా దేశాల (Asian Countries)పై సుంకాలు విధించేందుకు మెక్సికో (Mexico) సిద్ధమైంది.
భారత్, చైనా, దక్షిణ కొరియా వంటి పలు దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాల్ని పెంచే బిల్లుకు మెక్సికన్ సెనెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కనీసం 5 శాతం నుంచి 50 శాతం వరకు దిగుమతి సుంకాల్ని పెంచే బిల్లుకు మెక్సికో సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు 76 మంది అనుకూలంగా, 5 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. కొత్త సుంకాలు వచ్చే ఏడాది నుంచే అమల్లోకి రానున్నాయి. దుస్తులు, లోహాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఉక్కు సహా అనేక ఉత్పత్తులపై వీటి ప్రభావం పడనుంది. ఈ నిర్ణయంతో దక్షిణాసియా దేశాలపై మోక్సికో వాణిజ్య యుద్ధం ప్రకటించినట్లైంది. ఈ సుంకాలు దేశీయ తయారీని పెంచేందుకు, ముఖ్యంగా చైనాతో పెరుగుతున్న వాణిజ్య అసమతుల్యతలను పరిష్కరించడానికి ఉద్దేశించినవిగా క్లాడియా ప్రభుత్వం చెబుతోంది.
Also Read..
Sperm Donor | ఒక్క వీర్యదాత కారణంగా రిస్క్లో 200 మంది చిన్నారుల జీవితం.. క్యాన్సర్ ముప్పు..!
India In UN | అఫ్ఘాన్పై పాక్ దాడులు యుద్ధ చర్యలే : భారత్