Today History: అనంతాన్ని కనుగొని ప్రపంచ గణితానికే లెక్కలు నేర్పిన గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి నేడు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ 22 న మనం జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆయన స్మృత్యర్థం ఏటా ఈ ఉత్సవాలను జరుపుకోవాలని 2012 లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. అప్పట్లో రెండుసార్లు ఫెయిల్ అయిన రామానుజన్ చదివిన పాఠశాలకు ఇప్పుడు ఆయన పేరు పెట్టడం రామానుజన్ కీర్తిని ప్రతిబింబిస్తున్నది.
శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్లో తమిళ బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. కుంభకోణంలోని ప్రభుత్వ కళాశాలలో చదివిన రామానుజన్.. గణితమేతర విషయాలపై ఆసక్తి లేకపోవడంతో 12 వ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. 1912 లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో క్లర్క్గా ఉద్యోగ జీవితం ఆరంభించాడు. గణిత శాస్త్రజ్ఞుడు కూడా అయిన సహోద్యోగి ఒకరు అతడి గణిత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. రామానుజన్ని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలోని ట్రినిటీ కాలేజ్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ జీహెచ్ హార్డీ వద్దకు వెళ్లమని సహోద్యోగి సూచించాడు. ఇదే సమయంలో జానకి అమ్మల్తో వివాహం కావడంతో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్లలేకపోయారు. దాంతో కొన్ని ఫార్ములాలను ప్రొఫెసర్ జీహెచ్ హార్డీకి లేఖ ద్వారా పంపాడు. ఈ ఫార్ములాలు హార్డీని ఎంతగానో ఆకట్టుకోవడంతో లండన్ రావాల్సిందిగా రామానుజన్ను ఆహ్వానించి గురువుగా మారారు. వీరిద్దరూ కలిసి గణితశాస్త్రానికి సంబంధించిన అనేక పరిశోధనలు చేశారు.
ట్రినిటీ కాలేజీ నుంచి 1916లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అందుకోగా, 1917లో లండన్ మ్యాథమెటికల్ సొసైటీలో సభ్యత్వం లభించింది. మరుసటి ఏడాది రాయల్ సొసైటీలో స్థానం పొందాడు. అనంతరం ట్రినిటీ కాలేజీ ఫెలోషిప్ పొందిన మొదటి భారతీయుడు కూడా అయ్యాడు. 1919లో లండన్ నుంచి భారతదేశానికి తిరిగి వచిన రామానుజన్.. టీబీతో బాధపడుతూ 1920 లో మరణించాడు. కాగా, సముద్రయానం నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రాయశ్చిత్తం కోసం రామేశ్వరం వెళ్ళడంతో అతడి మృతదేహాన్ని కాల్చేందుకు పండితులు నిరాకరించి అవమానించారనే ప్రచారం కూడా వాడుకలో ఉన్నది. రామానుజన్ జీవిత చరిత్రను ‘ది మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ: ఎ లైఫ్ ఆఫ్ ది జీనియస్ రామానుజన్’ అనే పేరుతో రాబర్ట్ కనిగల్ రాశారు. 2015 లో ఆయనపై ‘ది మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ’ అనే సినిమా కూడా తీశారు.
2010: స్వలింగ సంపర్క చట్టంపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా
2000: గై రిచీని వివాహం చేసుకున్న పాప్ స్టార్ మడోన్నా
1975: సినీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ మరణం
1966: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్థాపనకు పార్లమెంట్ ఆమోదం
1947: కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించిన ఇటాలియన్ పార్లమెంటు
1882: తొలిసారిగా ఎరుపు, నీలం రంగు బల్బుల సాయంతో క్రిస్మస్ చెట్టును అలంకరించిన ఎడ్వర్డ్ హెచ్ జాన్సన్
1851: రూర్కీ నుంచి పిరాన్ మధ్య నడిచిన భారతదేశంలో మొట్టమొదటి గూడ్స్ రైలు
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..