Maldives | మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (President Mohamed Muizzu) భారత్పై తన వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ప్రకటన చేశారు. మాల్దీవ్స్లో ఉన్న భారత బలగాలు (Indian troops) మే 10 నాటికి ఖాళీ చేస్తాయని వెల్లడించారు.
ముయిజ్జు (President Mohamed Muizzu) ఇవాళ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. అయితే, ఆయన ప్రసంగాన్ని ప్రధాన ప్రతిపక్షాలైన ఎండీపీ, డెమొక్రాట్స్ బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో ముయిజ్జు ఖాళీ కుర్చీలకు తన ప్రసంగాన్ని వినిపించారు. ముయిజ్జు ప్రసంగం సమయంలో సభలో కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సభలో ఆయన మాట్లాడుతూ.. రెండు దశలుగా తమ దేశంలోని భారత బలగాలు వెనక్కి వెళ్లిపోతాయని వెల్లడించారు.
మాల్దీవ్స్లో ఉన్న మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వహిస్తున్న భారత బలగాలు మార్చి 10 లోగా వెళ్లిపోతాయని తెలిపారు. మిగతా రెండు స్థావరాల్లో ఉన్న భారత దళాలు మే 10 నాటికి వైదొలుగుతాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్తో ఉన్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించుకోవడం లేదని ముయిజ్జు వెల్లడించారు. తమ సార్వభౌమత్వం విషయంలో మరొక దేశం జోక్యాన్ని తాము అనుమతించబోమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
Also Read..
Mohamed Muizzu | పార్లమెంటులో ప్రసంగించనున్న మాల్దీవుల అధ్యక్షుడు.. బహిష్కరించనున్న విపక్షాలు
Cat Meat | హృదయవిదారకం.. ఆకలితో పిల్లి మాంసాన్ని పీక్కుతిన్న యువకుడు..!
Gobi Manchurian | అక్కడ గోబీ మంచూరియాపై బ్యాన్.. ఎందుకంటే..?