Cat Meat | కేరళ (Kerala) రాష్ట్రంలో హృదయవిదారకర ఘటన వెలుగుచూసింది. ఆకలికి తట్టుకోలేక ఓ యువకుడు చనిపోయిన పిల్లి మాంసాన్ని (cat meat) తిన్నాడు. మలప్పురం జిల్లా కుట్టిప్పురం (Kuttippuram) బస్టాండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
కుట్టిప్పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 5 గంటల సమయంలో ఓ 27 ఏళ్ల యువకుడు బస్టాండ్లో కూర్చొని చనిపోయిన పిల్లి మాంసాన్ని పీక్కుతింటూ కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తికి ఆహారం అందించి.. అతడిని వెంటనే కోజికోడ్ (Kozhikode)లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు గత ఐదు రోజుల నుంచి భోజనం చేయలేదు. ఆకలి బాధ తట్టుకోలేక.. చనిపోయిన పిల్లి మాంసాన్ని పీక్కుతిన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడిని ఒడిశాలోని దుబ్రీ (Dhubri) జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Also Read..
Gobi Manchurian | అక్కడ గోబీ మంచూరియాపై బ్యాన్.. ఎందుకంటే..?
Himachal Pradesh | భారీ హిమపాతం.. హిమాచల్లో జాతీయ రహదారులు సహా 475 రోడ్లు మూసివేత..!
Byjus | ఎట్టకేలకు ఉద్యోగులకు జీతాలు చెల్లించిన బైజూస్