Gobi Manchurian | ‘గోబీ మంచూరియన్’ (Gobi Manchurian) ఈ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ లొట్టలేసుకొని ఆరగించేస్తుంటారు. సాయంత్రం కాగానే గోబీ బండ్ల దగ్గర వాలిపోతుంటారు. ఈ వంటకం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా తినకుండా మానరు. అయితే, ఇంతటి పాపులర్ ఫుడ్పై భారత్లోని ఓ నగరం యుద్ధం ప్రకటించింది. గోబీని పూర్తిగా నిషేధించింది (Banned Gobi).
ఆ నగరం ఏదో కాదండి ప్రముఖ పర్యాటక రాష్ట్రం గోవా (Goa)లోని మపుసా (Mapusa) సిటీ. గోబీ మంచూరియన్ని అపరిశుభ్రంగా తయారు చేయడమే కాకుండా.. అందులో ప్రమాదకర రంగులను వాడుతుండటమే ఇందుకు కారణం. దాని తయారీకి వాడే సింథటిక్ రంగులు, పరిశుభ్రతపై ఆహార నిపుణుల ఆందోళనల కారణంగా మపుసా మున్సిపల్ కౌన్సిల్ గోబీపై యుద్ధం ప్రకటించింది. నగరంలోని ఫుడ్ స్టాల్స్, విందు కార్యక్రమాల్లో గోబీ మంచూరియన్ తయారీపై బ్యాన్ విధించింది.
కాగా, మపుసా సిటీనే కాదు ఇప్పటికే గోవాలోని మరో నగరం కూడా గోబీ మంచూరియన్పై యుద్ధం ప్రకటించేసింది. 2022 సంవత్సరంలో మోర్ముగావ్ మున్సిపల్ కౌన్సిల్ కూడా గోబీపై బ్యాన్ విధించింది. మోర్ముగావ్లోని శ్రీ దామోదర్ ఆలయంలో వాస్కో సప్తాహ్ ఫెయిర్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫుడ్ స్టాల్స్లో గోబీ మంచూరియన్ తయారీపై మోర్ముగావ్ మున్సిపల్ కౌన్సిల్ నిషేధం విధించింది. అంతేకాదండోయ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు మోర్ముగావ్లోని గోబీ మంచూరియన్ స్టాళ్లపై రైడ్స్ కూడా నిర్వహించారు. అప్పటి నుంచి ఆ నగరంలో ఎవరూ కూడా గోబీ మంచూరియన్ను తయారు చేయడం లేదు.
Also Read..
Himachal Pradesh | భారీ హిమపాతం.. హిమాచల్లో జాతీయ రహదారులు సహా 475 రోడ్లు మూసివేత..!
Pakistan | పోలీసు స్టేషన్పై ఉగ్రమూకల దాడి.. 10 మంది పోలీసులు మృతి
Byjus | ఎట్టకేలకు ఉద్యోగులకు జీతాలు చెల్లించిన బైజూస్