Earthquake | కొత్త ఏడాది వేళ జపాన్ (Japan)ను వరుస భూకంపాలు (Earthquake) వణికించిన విషయం తెలిసిందే. ఆ భూకంపం నుంచి జపాన్ వాసులు తేరుకోక ముందే ఆ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ జపాన్లో 6.0 తీవ్రతతో మంగళవారం భూమి కంపించింది. హోన్షు కోస్ట్ (Coast of Honshu) తీరంలో మధ్యాహ్నం 2.29 గంటలకు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ సారి సునామీ (tsunami) హెచ్చరికలేవీ జారీ చేయలేదని జపాన్ మీడియా వెల్లడించింది.
కొత్త సంవత్సరం మొదటిరోజు జపాన్లో వరుస భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 200 మందికిపైనే ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంతలో మరోసారి భూమి కంపించడంతో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు.
An earthquake with a magnitude of 6 on the Richter Scale hit near West Coast of Honshu, Japan at 2:29 PM (IST): National Center for Seismology pic.twitter.com/vU20rlMUX5
— ANI (@ANI) January 9, 2024
కొత్త ఏడాది వరుస ప్రమాదాలు..
కాగా, కొత్త ఏడాది జపాన్ను వరుస ప్రమాదాలు వెంటాడిన విషయం తెలిసిందే. నూతన సంవత్సరం మొదటి రోజు సెంట్రల్ జాపాన్ను వరుస భూకంపాలు (Japan earthquake) వణికించాయి. ఏకంగా 155 కంటే ఎక్కువ సార్లు రిక్టరు స్కేలుపై 4 కంటే ఎక్కువ తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. నోటో ద్వీపకల్పంలో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల పెను నష్టమే వాటిల్లింది. ఈ భూకంపం ఘటనలో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 200 దాటింది. సుమారుగా 450 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనలో గల్లంతైన 211 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఆచూకీ లేకుండా పోయిన వారి జాడ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నారు. సుమారు 3 వేల మందికి పైగా ఈ గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్నట్లు జపాన్ మీడియా వెల్లడించింది.
మంటల్లో విమానం..
ఇక ఆ తర్వాతిరోజు రాజధాని టోక్యోలో ఓ విమానం భారీ మంటల్లో చిక్కుకుపోయింది. జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన జేఏల్ 516 విమానం గత మంగళవారం టోక్యో ఎయిర్పోర్టులో అగ్ని ప్రమాదానికి గురైంది. హనేడా విమానాశ్రయం (Haneda airport ) రన్వేపై దిగుతుండగా అక్కడే ఉన్న కోస్టు గార్డు ఎయిర్క్రాఫ్ట్ (Coast Guard aircraft)ను ఢీకొట్టడంతో విమానంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. కొద్ది ప్రమాదం తర్వాత అక్కడ భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో విమానం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో జేఏల్ 516 విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 400 మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ వారంతా సురక్షితంగా బయటపడినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
Also Read..
JN.1 | 800 మార్క్ను దాటిన జేఎన్.1 కేసులు.. తెలంగాణలో విజృంభిస్తోన్న కొత్త వేరియంట్
White House | అమెరికా అధ్యక్ష భవనం గేటుపైకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి అరెస్ట్
Rats In IRCTC Stall | ఐఆర్సీటీసీ స్టాల్లో ఎలుకలు స్వైరవిహారం.. ఫుడ్ను టేస్ట్ చేస్తూ.. VIDEO