Earthquake | పొరుగు దేశం పాకిస్థాన్ ( Pakistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో శనివారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (National Centre for Seismology) వెల్లడించింది. భూమికి 190 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. స్వల్ప స్థాయిలోనే భూమి కంపించడం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని సమాచారం.
కాగా, గత శనివారం రాత్రి కూడా పాకిస్థాన్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. రాజధాని ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం తీవ్రత ఆ దేశ వాతావరణ విభాగం ప్రకారం 4.9గా నమోదైంది. అప్పుడు కూడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
Also Read..
Viral Video | కదులుతున్న కారుపై స్టంట్స్.. ఆకతాయిలకు తగిన బహుమతి ఇచ్చిన పోలీసులు
Ajit Pawar | మహారాష్ట్రలో సుప్రియా సూలే వర్సెస్ సునేత్ర పవార్.. బారామతిలో రసవత్తర పోరు..!
Black Panther | ఇంటి ముంగిట చక్కర్లు కొట్టిన బ్లాక్ పాంథర్.. వీడియో