శ్రీనగర్ : జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ప్రాంతీయ అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ రానా డిమాండ్ చేశారు. ఇక్కడి శాశ్వత నివాసితులకు భూమి, ఉద్యోగాల హక్కులను కల్పించాలని కోరారు. రాజౌరీ ప్రాంతంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫీస్ బేరర్లు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో రానా మాట్లాడారు. ఈ సమావేశం ఐదు గంటలపాటు కొనసాగింది. పార్టీ నిర్మాణంపై చర్చించారు. ప్రజల సమస్యలు కూడా చర్చించారు. అన్ని సమస్యల పరిష్కారం కేవలం నేషనల్ కాన్ఫరెన్స్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. సమీప భవిష్యత్లో పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
నేషనల్ కాన్ఫరెన్స్ ఎల్లప్పుడూ యువ నాయకులు, మహిళలకు ముందుకు నడిపించడానికి వేదికగా నిలుస్తున్నదని దేవేంద్ర సింగ్ రానా తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోని క్యాడర్కు చేరుకోవడం ద్వారా సభ్యత్వ డ్రైవ్ను తీవ్రతరం చేయడంపై నాయకులు దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో వర్చువల్గా మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించడం ద్వారానే అభివృద్ది సాధ్యమవుతుందని చెప్పారు. కేంద్రం ఈ దిశగా చర్చలు జరుపాలని ఆయన సూచించారు.
గోర్లను చూసి డయాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!
ప్రోటీన్ వనరు : రోగనిరోధక శక్తి కోసం సోయా ఫుడ్స్ ఉత్తమం
బహు భార్యత్వానికి మద్దతు.. లా ప్రొఫెసర్కు ఇక్కట్లు
ఆంక్షల పొడగింపు : బ్రిటన్ను భయపెడుతున్న డెల్టా వేరియంట్
గెలుపు కోసం : యూపీలో త్వరలో క్యాబినెట్ విస్తరణ..?
ఏడాది ఆలస్యం : అక్టోబర్ 1 నుంచి దుబాయ్ ఎక్స్పో 2020
చరిత్రలో ఈరోజు : రక్తదానంతో మరొకరికి ప్రాణదానం
అంతరిక్షం నుంచి వచ్చిన స్పెర్మ్తో 168 ఎలుకలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..