కిన్షాషా : (Congo Boat) కాంగోలో పడవలు మునిగిపోవడం సర్వసాధారణం అయిపోయింది. తాజాగా మరో పడవ కూడా నదిలో మునకేసింది. ఈ దుర్ఘటనలో 50 మందికి పైగా మరణించారు. కెపాసిటీ కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. 100 మందికి పైగా మునిగిపోగా.. 51 మృతదేహాలు ఇప్పటివరకు బయటకు తీశారు. ప్రమాదం నుంచి 39 మంది సురక్షితంగా బయటపడ్డారు. కనిపించకుండా పోయిన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రమాదాన్ని వాయవ్య ప్రావిన్స్ మొంగాలా గవర్నర్ అధికార ప్రతినిధి నెస్టర్ మగ్బాడో ధ్రువీకరించారు.
పడవ ఎక్కే ముందు ప్రయాణికులను లెక్కించలేదని గవర్నర్ ప్రతినిధి మగ్బాడో చెప్పారు. ఇటువంటి పరిస్థితిలో, పడవ సీటింగ్ సామర్థ్యాన్ని చూసి తప్పిపోయిన వారి సంఖ్యను అంచనా వేస్తున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని అధికారులు చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని సజీవంగా రక్షించేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. రాత్రి సమయంలో చెడు వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని లేదా పడవలో రద్దీ కూడా కారణం కావచ్చునని మగ్బాడో చెప్పారు. ప్రావిన్షియల్ అధికారులు మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు.
కాంగోలో పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. తరచుగా ఎక్కువ మంది ప్రయాణికులను తరలించడంలో కాంగో పడవలు ఎంగేజ్ అవుతుంటాయి. అలాగే, ప్రయాణం సమయంలో చాలా మంది లైఫ్ జాకెట్లు ధరించరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మై-ఎన్డొంబే ప్రావిన్స్లోని పడవ బోల్తాపడి 60 మంది మరణించారు. 2020 మే నెలలో జరిగిన ప్రమాదంలో 10 మంది, 2010 జూలైలో జరిగిన ఘటనలో 135 మంది దుర్మరణం పాలయ్యారు.
చైనా తయారీ టెస్లా కార్లు ఇక్కడ అమ్మొద్దు : నితిన్ గడ్కరీ
కోహ్లీ, రోహిత్ కన్నా ఈ ఆటగాడికి సామర్ధ్యం ఎక్కువ : గంభీర్ వ్యాఖ్య
పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం: వెంకయ్యనాయుడు
ప్రీపోల్ సర్వేలను నిషేధించాలి : మాయావతి
మాకు ‘మియా’ ఓట్లు వద్దే వద్దు : హిమంత బిశ్వ శర్మ
ఔను! నేను ‘చరస్’ తీసుకున్నా.. పంచనామాలో ఆర్యన్ ఖాన్ నేరాంగీకారం
బొలీవియా అడవుల్లో చే గువేరా దారుణహత్య
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..