బీరుట్ : (Lebanon) లెబనాన్లో విద్యుత్ సంక్షోభం తారా స్థాయికి చేరుకున్నది. ఇంధనం కొరతతో దేశంలోని రెండు అతిపెద్ద విద్యుత్ కేంద్రాలను శనివారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. దాంతో దేశం అంధకారంలో మునిగిపోయింది. చైనా, భారతదేశం తర్వాత అతిపెద్ద విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశం లెబనాన్. ఈ సంక్షోభం మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నదని తెలుస్తున్నది. లెబనీస్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ సమాచారాన్ని వెల్లడించింది.
లెబనాన్ ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటుండగా.. ప్రస్తుతం విద్యుత్ కొరత తీవ్రంగా మారింది. ఇంధన కొరత కారణంగా ప్రధాన ప్లాంట్లు మూతపడి లెబనాన్ దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయానికి గురైంది. ప్రస్తుతం తీవ్రంగా ప్రభావితమై మూతపడిన డీర్ అమ్మర్, జహ్రానీ విద్యుత్ కేంద్రాలు లెబనాన్ విద్యుత్ సరఫరాలో 40 శాతం అందిస్తున్నాయి. విదేశీ ఇంధన సరఫరాదారులకు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద సరిపడా విదేశీ కరెన్సీ నిల్వలు లేనందున ఇంధన సరఫరా నిలిచిపోయింది.
పేద దేశమైన లెబనాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దేశీయ డిమాండ్ను తీర్చడానికి దేశం విద్యుత్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడింది. అయితే, కొనసాగుతున్న ఆర్థిక ద్రవ్యత సంక్షోభం 2019 ఆగస్టు నుంచి, ఆ తర్వాత 2020 లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. లెబనీస్ కరెన్సీ 2019 నుంచి 90 శాతం క్షీణించింది.
తెలంగాణ చీఫ్ జస్టిస్గా సతీష్ చంద్ర శర్మ.. రాష్ట్రపతి ఆమోదం
చైనా తయారీ టెస్లా కార్లు ఇక్కడ అమ్మొద్దు : నితిన్ గడ్కరీ
కోహ్లీ, రోహిత్ కన్నా ఈ ఆటగాడికి సామర్ధ్యం ఎక్కువ : గంభీర్ వ్యాఖ్య
పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం: వెంకయ్యనాయుడు
ప్రీపోల్ సర్వేలను నిషేధించాలి : మాయావతి
మాకు ‘మియా’ ఓట్లు వద్దే వద్దు : హిమంత బిశ్వ శర్మ
ఔను! నేను ‘చరస్’ తీసుకున్నా.. పంచనామాలో ఆర్యన్ ఖాన్ నేరాంగీకారం
బొలీవియా అడవుల్లో చే గువేరా దారుణహత్య
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..