హైదరాబాద్ : జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇండ్లను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్న యువకున్ని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డీఎస్సై వి.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక హర్రాస్పెంట ప్రాంతానికి చెందిన నర్సింగ్రావు కుమారుడు ఉదర్ లక్ష్మణ్(20) గత కొంత కాలంగా లక్ష్మణ్ మద్యానికి బానిపై తాళం వేసిన ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బులతో జాల్సాలు చేస్తు్న్నాడు.
గత నెల 31వ తేదీన నింబోలి అడ్డా ప్రాంతానికి చెందిన అర్జున్ మోరియా తన ఇంట్లో స్నేహితులతో కలిసి పడుకోగా ఇదే అదునుగా భావించిన లక్ష్మణ్ ఇంట్లోకి ప్రవేశించి రూ.35 వేల నగదు, ఖరీదైన ఫోన్ను దొంగిలించి పారిపోయాడు. అర్జున్ మోరియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాచిగూడ పోలీసులు.. గురువారం లక్ష్మణ్ను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. లక్ష్మణ్ నుంచి రూ.15 రూపాయలు, ఖరీదైన ఫోన్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలి