హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్లో ఓ మహిళ.. రోడ్డు పక్కన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శంఖేశ్వర బజార్కు వెళ్లే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ గర్భిణీకి నొప్పులు మొదలయ్యాయి. దీంతో రోడ్డు మీదనే కుప్పకూలిపోయింది. వెంటనే స్థానికులు తనను గమనించి.. రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. వెంటనే అంబులెన్స్కు కాల్ చేశారు. కానీ.. ఆమెకు నొప్పులు ఎక్కువవడంతో.. అంబులెన్స్ వచ్చేలోపు ఆ మహిళ ప్రసవించింది. వెంటనే అంబులెన్స్లో తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు.