Unemployees | 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు. త్వరలో రాష్ట్రంలో 5 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటన చేయడంపై నిరుద్యోగులు రోడ్డెక్కారు.
పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుండి 20 వేలకు పెంచాలని ఓయూలో నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. కేవలం 5 వేల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం కాదని.. ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు మెగా డీఎస్సీ ద్వారా 25 వేల ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని అంబేద్కర్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరుద్యోగ యువత భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుండి 20 వేలకు పెంచాలని ఓయూలో నిరుద్యోగుల ధర్నా!
కేవలం 5 వేల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు కాదు, ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలని.. మెగా డీఎస్సీ ద్వారా 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల… pic.twitter.com/vIzq1SDBsV
— BRS Party (@BRSparty) June 15, 2026