కాచిగూడ,ఆగస్టు 29 : యశ్వంత్పూర్ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి ఖరీదైన సెల్ఫోన్ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు తెలిపిన వివరాల ప్రకారం.. హబీబ్నగర్,నాంపల్లి ప్రాంతానికి చెందిన భీమ్నాయక్ కుమారుడు వి.విజయ్కుమార్ నాయక్(23)ఎంబీఏ చదువుతున్నాడు.
గుంతకల్ రైల్వేస్టేషన్లో యశ్వంత్పూర్ రైలెక్కి కాచిగూడకు వస్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఖరీదైన సెల్ఫోన్ను దొంగిలించారు. ఆదివారం కాచిగూడ రైల్వే పోలీసులకు విజయ్కుమార్ నాయక్ పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం మహబూబ్నగర్ రైల్వే పోలీస్స్టేషన్కు బదిలీ చేసినట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపారు.