మల్లాపూర్, ఏప్రిల్ 10: మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట్ హెచ్బీకాలనీ, మల్లాపూర్ డివిజన్లలో ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు జె.ప్రభుదాస్, పన్నాల దేవేందర్రెడ్డితో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
మీర్పేట్ డివిజన్ రాజీవ్నగర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి.. రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలన్నారు. గుండారపు శ్రీనివాస్రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.