TSSPDCL | హైదరాబాద్ : రాష్ట్రంలో తెల్ల రేషన్కార్డు ఉన్న వారికే గృహజ్యోతి పథకం వర్తింప జేసేలా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందించేందుకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తించే పనిని విద్యుత్తుశాఖ చేపట్టినట్లు సమాచారం.
అయితే ఒక ఇంటికి ఒక మీటరుకే పథకం అమలు.. కిరాయికి ఉండేవారు అర్హులు కాదు అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై టీఎస్ఎస్పీడీసీఎల్ స్పందించింది. ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో అద్దెకు ఉంటున్న వారు కూడా గృహజ్యోతి పథకానికి అర్హులే అని స్పష్టం చేసింది. ఈ పోస్టు ఫేక్ అని తెలిపింది. తప్పుడు స్టేట్మెంట్లతో ప్రజలు తప్పుదోవ పట్టించొద్దని అధికారులు కోరారు.
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం గృహ వినియోగ విద్యుత్తు కనెక్షన్లు 52 లక్షల వరకు ఉంటే అందులో సుమారు 30 లక్షలలోపు వినియోగదారులు 200 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగిస్తున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 19 లక్షల మంది గృహజ్యోతి పథకం కోసం గ్రేటర్ పరిధిలో దరఖాస్తు చేసుకున్నారు. మిగతావారంతా అద్దెకు ఉంటున్నవారు, సొంతిల్లు లేనివారు ఉన్నారు. గ్రేటర్ పరిధిలో విద్యుత్తు శాఖ లెక్కల ప్రకారం 30 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేయాలంటే ప్రతి నెలా సుమారు రూ.700 కోట్ల వరకు వ్యయం అవుతుంది.
Tenants are also eligible under proposed Gruha Jyothi Scheme
Below post by @TeluguScribe is FAKE https://t.co/Ive0FG09dG
— TSSPDCL (@TsspdclCorporat) February 6, 2024