Hydraa | హైడ్రాకు కోర్టుల నుంచి మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో హైడ్రాకు బిగ్ షాక్ తగిలింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
హైదరాబాద్ – మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంటలో సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమిపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కంటోన్మెంట్లోని 40 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందినదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పిటిషన్ వేసింది. అయితే ఆ భూమి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్కు చెందిందిగా హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు కాంగ్రెస్ సర్కార్ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. గతంలో ఇదే కేసులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
Uttar Pradesh | యూపీలో కారు అదుపుతప్పి ముగ్గురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
KA Paul | యుద్ధాలు 58, ప్రభావం 850 కోట్ల మందిపై.. ఆవేదన వ్యక్తంచేసిన కేఏ పాల్
హయత్నగర్ పరిధిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు