ఆర్కేపురం : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల వరియర్ కరాటే డో ఫేడరేషన్ ఆధ్వర్యంలో బొమ్మిడిలలిత గార్డెన్లో నిర్వహంచిన నేషనల్ కుప్, కరాటే చాంఫియన్షిప్లో యోధ గోజు ర్యూ కరాటే డు స్పోర్ట్స్అసోసియేషన్ క్రీడాకారిణి జి.నందిని అండర్ 16 బాలికల బ్లాక్ అండ్ బ్రౌన్ బెల్డ్ విభాగంలో కప్ సాధించింది. ఆదివారం మాస్టర్ మహేష్ నాయక్తో కలిసి నందిని మంత్రి సబితాఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో రాణింపుతో నలుగురిలో గుర్తింపుతో పాటు దేశానికి, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన క్రీడాకారులను ప్రభుత్వం తరుపున గౌరవించడంతో పాటు నగదు బమతులను అందజేశారని తెలిపారు. కప్ సాధించిన నందిని, మాస్టర్ మహేష్ నాయక్ను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ పి.ఎం.రాము, ఎస్.ప్రసాద్, సతీష్ తదితరులు ఉన్నారు.