Unemployees | 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ హామీలను నెరవేర్చకుండా తమ పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేవలం 5 వేల పోస్టులతో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.
తాజాగా మరోసారి దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. పోస్టులు పెంచి 20 వేల పోలీస్ ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరిన నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అనుమతి తీసుకొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పోలీసులు తమను అరెస్ట్ చేస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నాయి.
దిల్సుఖ్నగర్లో మరోసారి రోడ్డెక్కిన నిరుద్యోగులు
20 వేల పోలీస్ ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగుల ఆందోళన
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
పర్మిషన్ తీసుకొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్… https://t.co/JQRSS6UBa7 pic.twitter.com/YCgPHCA1VQ
— Telugu Scribe (@TeluguScribe) July 16, 2026