Durgam cheruvu | నిజాంపేట చెరువు పూర్తిగా గుర్రపుడెక్కతో నిండి పోయిందని.. చెత్తాచెదారం, మురుగునీరు, గుర్రపుడెక్కతో నిండి పోయిన చెంగిచర్ల చెరువు, పరిసర ప్రాంతాలు పూర్తిగా కంపుకొడుతున్నాయి అంటూ ఇప్పటికే స్థానికులు వాపోయారని తెలిసిందే. మరోవైపు మీడియాలో కథనాలతో దుర్గం చెరువు బాధ్యత మాది అంటూ హైడ్రా ముందుకొచ్చింది.
అయితే తాజాగా దుర్గం చెరువు పరిస్థితి చూస్తే హైడ్రా ఎంత బాధ్యత తీసుకుందో అర్థమవుతుంది. అదే చెత్తాచెదారం, గుర్రపు డెక్క, మురుగు నీటితో దర్శనమిస్తున్న దుర్గం చెరువు దృశ్యాలను సంతాన సెల్వమ్ Bicycle Mayor of Hyderabad ఎక్స్లో పోస్ట్ చేశారు.
దుర్గం చెరువులో కనీస పరిశుభ్రత లేదని, నీటిలో ఉండే జీవులు బతకలేవని, చుట్టు పక్కన ఉండే ఇళ్లల్లోకి గ్రౌండ్ వాటర్ కూడా ఇవ్వే వెళతాయని వీడియో ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నగరంలో చెరువుల పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది .
హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద దుస్థితి
కనీస పరిశుభ్రత లేదని, నీటిలో ఉండే జీవులు బతకలేవని, చుట్టు పక్కన ఉండే ఇళ్లల్లోకి గ్రౌండ్ వాటర్ కూడా ఇవ్వే వెళతాయని వీడియో చిత్రీకరించిన ఓ నెటిజెన్
Credits: Bicycle Mayor of Hyderabad https://t.co/IPrCkGbIgG pic.twitter.com/SFDynUM4EU
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2026
Dubai | దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి
Ramchander Rao | ప్రాజెక్టులు సీఎం రేవంత్రెడ్డికి ఏటీఎంలుగా మారాయి : రాంచందర్ రావు