కొండాపూర్ందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. మృతురాలి భర్త, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగండ్లలో నివాసం ఉండే ధాడి శ్రీనివాస్ తన భార్య అనసూయ(43)తో కలిసి మంగళవారం చందానగర్ చాట్వాజ్ మెన్షన్ అపార్ట్మెంట్లో ఉంటున్న మేనమామ ధాడి గోవింద్ను పరామర్శించేందుకు వచ్చారు. అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ వద్దకు చేరుకున్న శ్రీనివాస్ ముందుగా లిఫ్ట్లోకి ప్రవేశించగా, అనసూయ లిఫ్ట్లోకి ఎకుతున్న సమయంలో ఒక కాలు లోపల, మ రో కాలు బయట ఉండగానే లిఫ్ట్ తలుపులు పూర్తిగా మూసుకోకముందే అకస్మాత్తుగా పైకి కదిలింది.
దీంతో ఆమె లిఫ్ట్, ప్రవేశ ద్వారం మధ్య ఇరుకుపోయి గాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. శ్రీనివాస్ కేకలు వేయడం తో అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు అకడికి చేరుకుని లిఫ్ట్ను నిలిపేసి, అనసూయను బయటకు తీసి చందానగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అనసూయ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
కాగా ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ మరమ్మతు పనులు జరుగుతున్నప్పటికీ, లిఫ్ట్ టెక్నీషియన్ అనిల్ కుమార్ ప్రధాన విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా, నివాసితులను అప్రమత్తం చేసేలా ఎలాంటి హెచ్చరిక బోర్డ్డులు ఏర్పాటు చేయకుండా పనులు నిర్వహించాడని అనసూయ భర్త ఆరోపించారు. అలాగే లిఫ్ట్ టెక్నీషియన్ అనిల్ కుమార్ నిర్లక్ష్యంతో పాటు అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు రామ్రెడ్డి, యోగేందర్, వెంకట్రెడ్డి, లిఫ్ట్ నిర్వహణ సంస్థ జాన్సన్ ఎలివేటర్స్ యాజమాన్యం నివాసితుల భద్రతను నిర్ధారించడంలో విఫలమవడంతోనే ఈ ప్రమా దం జరిగి తన భార్య మృతి చెందిందని ఫిర్యాదులో పేరొన్నారు. శ్రీనివాస్ ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.