Harish Rao | గురుకుల టెండర్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పూటకో మాట మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. మేము గురుకులాల టెండర్లలోనేరూ. 2,000 కోట్ల టెండర్లలో స్కాం జరిగిందంటే.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముందు ఈ టెండర్ రూ.687 కోట్లు అన్నరు.. ఆ తర్వాత కాదు రూ.1,142 కోట్లు అన్నారు. మేమన్నం రూ.2000 కోట్ల టెండర్లు జరుగుతున్నయి.. దీంట్లో అవకతవకలు జరుగుతున్నయి. స్కాం జరిగింది అని చెప్పినమన్నారు.
గురుకుల కిరాణా టెండర్లు రూ.800 కోట్లకు పిలిచారు. పత్రికల్లో రూ.200 కోట్ల గోల్మాల్ జరిగిందని వచ్చింది. అన్నీ కలిపితే దాదాపు రూ.2,000 కోట్లే కదా..? అని హరీశ్ రావు గుర్తు చేశారు. ఈ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టిన తర్వాత ప్రముఖ పత్రికల్లో వార్త వచ్చిన తర్వాత నెల 15 రోజుల నుంచి ఈ టెండర్ను ఆపి పెట్టారు. ఈ టెండర్ తప్పని కొందరు హైకోర్టుకు పోయారన్నారు.
గురుకుల టెండర్లపై పూటకో మాట మాట్లాడుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్
మేము గురుకులాల టెండర్లలోనే
రూ. 2,000 కోట్ల టెండర్లలో స్కాం జరిగిందంటే..
ముందు రూ.687 కోట్లు, తర్వాత రూ.1,142 కోట్లు అన్నారు.గురుకుల కిరాణా టెండర్లు రూ.800 కోట్లకు పిలిచారు.
పత్రికల్లో రూ.200 కోట్ల గోల్మాల్… pic.twitter.com/1ydQFrq3Eb— BRS Party (@BRSparty) July 2, 2026