హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు అపూర్వ స్పందన లభిస్తున్నది. ఎందరో ప్రముఖులు మొక్కలు నాటి ఛాలెంజ్ పూర్తి చేశారు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లోని జీహెచ్ఎంసీ పార్క్లో సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. ఇలా సామూహికంగా మొక్కలు నాటడం పట్ల సినీ, టీవీ రంగాలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు సంతోషం వ్యక్తం చేశారు.
సినీ,టీవీ రంగాలకు చెందిన నటీనటులతో కలిసి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. గ్రీన్ఇండియా చాలెంజ్లో బాగంగా ప్రశాసన్నగర్లోని పార్కులో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొని సినీ,టివి ఆర్టిస్టులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సంపత్ నంది, కాదంబరి కిరణ్, టీవీ నటి మీనా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మానస్, కాజల్, జబర్దస్త్ ఫేం రాకేష్, అదిరే అభి, టీవీ ఫెడరేషన్ వ్యవస్థాపకులు నాగబాల సురేష్ కుమార్, టీవీ ఆర్టిస్టులు సన, వైభవ్ సూర్య ,రాజేంద్ర ,టార్జాన్, డైరెక్టర్స్ పులి వాసు, ప్రసాద్, దీప్తి బాజ్పెయ్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..