kishore Goud | ఎన్నోపోరాటాలు,త్యాగాల వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచే విధంగా మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్ గౌడ్ డిమాండ్ చేశారు. 60 సంవత్సరాల పోరాటం, 1200 మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. తక్షణమే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ః
మహిళా రిజర్వేషన్ల బిల్లును, నియోజకవర్గాల డీలిమిటేషన్ చేస్తామని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి దాని గురించి మాట్లాడకుండా సందర్భం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవహేళన చేస్తూ మాట్లాడడం చాలా సిగ్గు చేటన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది బీజేపీ ఎంపీలు, 8మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి కనీసం తేజస్వి సూర్య ప్రసంగాన్ని అడ్డుకోకుండా ఉండడం చాలా సిగ్గుచేటు అని అన్నారు.
BRS partyఈరోజు లోక్ సభలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండి ఉంటే తప్పకుండా తేజస్వి సూర్య ప్రసంగాన్ని అడ్డుకునే వారని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని కిశోర్ గౌడ్ అన్నారు. కాబట్టి రెండు జాతీయ పార్టీల అయిన బీజేపీ, కాంగ్రెస్ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తప్పకుండా ఓటు ద్వారా ఈ రెండు జాతీయ పార్టీలకు క తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని కిశోర్ గౌడ్ ఆకాంక్షించారు.
Hyderabad | దారుణం.. జ్యూస్ అని చెప్పి నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Karepalli | రోడ్డు ప్రమాద నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
Loksabha: ఆ బిల్లులపై చర్చకు 251 మంది అనుకూలం.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్