హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను గురించి ప్రజల్లో చైతన్యం కల్పించిన గొప్ప వ్యక్తి. జీవితాంతం అదే దీక్షతో పోరాటం చేసిన మహనీయుడు ప్రొ. జయశంకర్ సార్ అని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బంజారాహిల్స్లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వప్నాన్ని సాకారం చేసుకోవడంతో పాటు పెద్ద సార్ ఆశయాలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ అనుక్షణం కృషి చేస్తున్నారన్నారు. ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్