సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేద్దామని నగరవాసులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పోరాడి తెచ్చుకున్నతెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. 75 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, కమిషనర్ లోకేష్కుమార్లతో కలిసి మేయర్ గ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..75ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధిని పోల్చి చూడాలన్నారు. దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో యువ నాయకుడు మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందని మేయర్ చెప్పారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమని మేయర్ అన్నారు.
యావత్ ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి కట్టడికి జీహెచ్ఎంసీ కార్మికులు, సిబ్బంది తమ ప్రాణాలను లెక్క చేయకుండా విశేష సేవలందించారని మేయర్ వారిని ఈ సందర్భంగా అభినందించారు. అన్ని రంగాలతో పాటు నగర ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపినప్పటికీ మెరుగైన పౌర సేవలందించడంలో జీహెచ్ఎంసీ ముందంజలోనే ఉందని గుర్తు చేశారు.
కార్యక్రమంలో ఆడిషనల్ కమిషనర్లు ప్రియాంక ఆలా, జయరాజ్ కెనెడి, శంకరయ్య, యాదగిరి రావు, కృష్ణ, విజయలక్ష్మి, సీపీఆర్వో వెంటకరమణ, చీఫ్ ఇంజినీర్లు దేవానంద్, సరోజా రాణి, జోనల్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కలెక్టర్, ఎస్పీకి చీరెలు బహుమతిగా ఇచ్చిన మంత్రి.. మురిసిపోయిన అధికారులు
ఘనంగా తీజ్ ఉత్సవాలు..ఆడిపాడిన మంత్రి సత్యవతి రాథోడ్
భార్య, కూతురిపై దాడి..కేసు నమోదు
జహీరాబాద్లో 74 కిలోల గంజాయి పట్టివేత
బయ్యారం పెద్ద చెరువులో యువకుడి గల్లంతు