మహబూబాబాద్ : గిరిజనుల సాంస్కృతిక పండగ తీజ్ ఉత్సవాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. తీజ్ పండుగ వేడుకల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్తో కలిసి ఆడి పాడారు. తీజ్ పండగ సందర్భంగా గోధుమ బుట్టలు నెత్తిన పెట్టుకొని గిరిజన నృత్యం చేశారు.
ప్రకృతిని ఆరాధిస్తూ గొప్పగా పూజించే తీజ్ ఉత్సవాల్లో ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్తో కలసి మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం బాల్య తండా (జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు స్వగ్రామం)లో మంత్రి పాల్గొని గిరిజనులందరికి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రావణ మాసంలో గిరిజన మహిళలు అంతా కలిసి ఘనంగా నిర్వహించుకునే తీజ్ పండుగ గిరిజన సాంస్కృతిక వైభవానికి నిదర్శనమని మంత్రి సత్యవతి తెలిపారు.
శ్రావణ మాసంలో వ్యవసాయ పనులు పూర్తి చేసుకున్న తరవాత 9 రోజుల పాటు ఈ తీజ్ పండుగ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటారు.
ప్రకృతి తమను చల్లగా చూడాలని కోరుకుంటారు. ఈ ఉత్సవాల్లో బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి,టీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ నాయక్, ముత్యం వెంకన్న, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కాబూల్లోని అమెరికా ఎంబసీలో కీలక పత్రాలు ధ్వంసం
భార్య, కూతురిపై దాడి..కేసు నమోదు
Heart Attack : సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన