హైదరాబాద్ : పార్లమెంట్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై(Rahul Gandhi) డీఎంకే ఐటీ సెల్(DMK IT Cell) తీవ్ర విమర్శలుగుప్పించింది. తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే కూటమి విడిపోవడంతో విమర్శలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడిని ‘ఎ బిగ్ జోక్’ అని అభివర్ణించింది. కాంగ్రెస్ అవసరాల కోసం తమను వాడుకుని, ఆ తర్వాత కొత్త పొత్తుల కోసం వెళ్లిపోయారని విమర్శించింది.
కాంగ్రెస్ రాజకీయ మనుగడ కోసం పోరాడుతున్నప్పుడు మేము వారిని భుజాలపై మోసాము, కానీ కొత్త మెరిసే బొమ్మను చూడగానే వారు పడవ నుండి దూకేశారని మండిపడ్డారు. ఇదే సమయంలో డీఎంకే పత్రిక ‘మురసోలి’లో సోమవారం తన సంపాదకీయంలో ఇండియా కూటమి సమావేశం తర్వాత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. ప్రతిపక్ష పార్టీల మధ్య చీలికలకు కాంగ్రెస్ నాయకుడే కారణమని ఆరోపించింది.