మోత్కూరు, జూలై 29: కొందరి మాటలు విని పోసపోవద్దని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. ఇటీవల తుంగతుర్తి వర్గపోరు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిలను ఉద్దేశించి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో బుధవారం హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజవర్గ నేతలకు పదవులు రావాలంటే ఎమ్మెల్యేనైనా తనతోనే సాధ్యమన్నారు. తాను మడమతిప్పని పోరాట యోధుడినని, సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలనలో తాను భాగస్వాముడిని అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ను తూలనాడితే ఎవరినీ క్షమించనని, నన్ను నేరుగా క్యాడర్ కలవాలన్నారు. మంది మాటలు విని మారుమానం పోతే మళ్లీ వచ్చే వరకు ఇల్లు ఆగమైంది..అన్నట్లుగా ఎవరితో పదవులు రావు.. తనతోనే సాధ్యమవుతుందన్నారు.