సూర్యాపేట, జూలై 29: మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్లు జగదీశ్రెడ్డి బుధవా రం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఇటీవల పలు రకాల ప్రమాదా లు, అనారోగ్యాలతో వైద్య సేవలు పొందిన 94 మందికి చెక్కులు అందజేశారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ము న్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్ల్లోర్లీడర్ అంగిరేకుల నాగార్జున, మాజీ జడ్పీటీసీ జీడీభిక్షం, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ పుట్ట కిశోర్, నాయకులు ఉప్పల ఆనంద్, తూడి నర్సింహారావు, కౌన్సిలర్లు ఉన్నారు. అనంతరం అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒం టెద్దు నర్సింహారెడ్డి తండ్రి ఒంటెద్దు రాఘవరెడ్డిని జగదీశ్రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.