హైరదాబాద్: నగరంలోని మియాపూర్లో ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్కు చెందిన నిఖిత్ రెడ్డి.. మియాపూర్లోని మాతృశ్రీనగర్లో ఉంటున్నాడు. ఇవాళ ఉదయం అనుమాస్పద స్థితిలో భవనంపై నుంచి కిందపడి చనిపోయాడు. ప్రస్తుతం అతడు ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కాగా, నిఖిత్ రెడ్డి కనిపించకుండా పోయాడని రెండు రోజుల క్రితం కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.