KTR | సీఎం రేవంత్ రెడ్డి రూ. వేల కోట్లతో గాంధీ విగ్రహం పెట్టడం కోసం పేదల ఇళ్లను కూల్చడానికి కంకణం కట్టుకున్నాడు. స్వయంగా గాంధీజీ మనవడే వద్దన్నా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రేవంత్ అసలే పట్టించుకోకుండా…బీజేపీతో కుమ్మకై ఈ వినాశనానికి తెరలేపిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా కేటీఆర్ ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..నిజంగా బీజేపీకి, నరేంద్ర మోదీకి నిజాయితీ ఉంటే ప్రజల సొమ్ము దోచుకోవద్దు. ఈ పేదవాళ్ల ఇండ్లు కూలొద్దు అన్న నిజాయితీ నీకుంటే ఆ రక్షణ శాఖ భూములు ఎందుకిచ్చినవని ప్రశ్నించారు. నిన్నగాక మొన్నఇచ్చిర్రు. నరేంద్రమోదీ ప్రభుత్వం.. బడే భాయ్, చోటే భాయ్ కలిసి రక్షణ శాఖ భూములులిచ్చేశారు. మూసీ ప్రాజెక్టు కట్టుకో గరీబోళ్ల ఇండ్లు కూలగొట్టు. మనమిద్దరం కలిసి మంచిగా ప్జ్రజలను మోసం చేద్దామని ఇవాళ దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాజెక్టుకు సహకరిస్తూ ఇచ్చిన రక్షణ శాఖ భూములను కాపాడాలన్నారు.
మూసీ ప్రాజెక్టు కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ భూములను కట్టబెట్టింది
పేదవాళ్ల ఇండ్లు కూల్చడం బీజేపీకి ఇష్టం లేకపోతే రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చారు?
బడే భాయ్, చోటే భాయ్ ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేద్దామని నిర్ణయించుకున్నారు
– కేటీఆర్ pic.twitter.com/QtBT1oQIg5
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2026