మహమ్మదాబాద్, ఆగస్టు 8 : మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం గాధిరాళ్ల గ్రామ సమీపంలోని శ్రీరామ రైస్మిల్పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం దాడులు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఆదిత్య, సీఐ గాంధీనాయక్ తనిఖీలు చేపట్టగా.. 2,800 టన్నుల ధాన్యం లెక్కల్లో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. ధాన్యం విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసినట్టు సమాచారం. సివిల్ సప్లయి అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రైస్మిల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.